బాబు సొంత ఇలకాలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. ఎన్నిక ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా బాబు సొంత నియోజక వర్గం కుప్పంలో ఏర్పాటు చేసిన సభకు జనం పోటెత్తారు. ఈ సభలో సీఎం చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత బంధువులనే మోసం చేసిన బాబు రాష్ట్రానికి ఏంచేస్తారని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
కుప్పంలో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంతో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు జగన్. ప్రజలు చంద్రమౌళికి తమ ఓటు వేసి గెలిపించాలని, ఆపై ఓ మంత్రిగా ఆయన ఇక్కడి ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ప్రజలు ఏమేం కోరుకుంటున్నారో, వాటన్నింటినీ చేస్తారని చెప్పారు. బాబు ఒక్కరితో యుద్ధం చేయడంలేదని ఎల్లోమీడియాతో కూడా యుద్ధం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో తనకు ఎదురుగాలి వీస్తోందన్న విషయం చంద్రబాబుకు తెలుసునని, అందువల్ల ప్రతి ఇంటికీ డబ్బులను పంపేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారని, ఆ డబ్బు తీసుకుని మోసపోవద్దని జగన్ సూచించారు.చంద్రబాబు పాలనపై ప్రతిగ్రామంలోనూ చర్చ చరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.