అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించడంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జగన్ , చంద్రబాబు ఇద్దరూ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కొన్నిజిల్లాల్లో రెండు పార్ట అభ్యర్ధుల మధ్య గట్టిపోటీ నెలకొంది. వాటిలో చీరాలనియోజక వర్గం ఒకటి. కొద్ది రోజుల క్రితం ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం చీరాల వైసీపీ అభ్యర్ధిగా ఆమంచిన జగన్ ప్రకటించారు. ఇక టీడీపీ నుంచి కరణం బలరాం బరిలో ఉన్నారు.
దీంతో ఇద్దరి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఆమంచిని అధికార పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆయన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్నున్నారని మండి పడ్డారు. లక్ష మంది పోలీసులతో అడ్డుకున్న 30 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ డిపాజిట్లు గల్లంతుకానున్నాయని.. ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తప్పదని అన్నారు. దోచుకున్న డబ్బును దొంగ అకౌంట్లలో దాచుకున్న చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.