Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో అభ్య‌ర్తిని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌…

- Advertisement -

ఎప్పుడైనా ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైసీపీ త‌మ అభ్య‌ర్తుల విష‌యంలో ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌తంలో అభ్య‌ర్తుల ఎంపిక‌లో చేసిన త‌ప్పులు పున‌రావ‌తం కాకుండా త‌గు జాత్త‌లు తీసుకుంటోంది. అందుకే పాద‌యాత్ర‌లో ముందుగాల‌నే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో వీళ్లు వైకాపా తరఫున ఆయా స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా జగన్ ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లా పత్తికొండ స్థానానికి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించిన జగన్ తాజాగా.. కర్నూలు టౌన్ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో కర్నూలు టౌన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేసి వైకాపా తరఫు నుంచి విజయం సాధించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల సెగ్మెంట్‌ల‌లో ప్ర‌త్యామ్నాయంగా అభ్య‌ర్తుల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల కుప్పం, పత్తికొండ నియోజకవర్గాలకు కూడా జగన్ అభ్యర్థులను ప్రకటించారు. పత్తికొండ నుంచి శ్రీదేవి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. కుప్పంలో చంద్రబాబుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. ఇప్పుడు మూడో అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇచ్చారు. పాద‌యాత్ర పూర్త‌య్యోలోపు మ‌రిన్నినియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -