జనసేన అధినేత పవన్పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఎందుకోసం వెనక్కు తగ్గారని రోజా ప్రశ్నించారు.
ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ అంటూ ప్రజల ముందుకు వస్తే నమ్మబోరని అన్నారు. రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం పవన్ సహకరించాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రత్యేకహక్షదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న పవన్ ఇప్పుడు రాజీనామా ఎందుకు అశిశ్వాస తీర్మానం పెట్టాలంటున్నారు. 545 ఎంపీలున్న లోక్సభలో కేంద్రంలో అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం అవుతుందనేదికూడా పవన్కు తెలియదాని ప్రశ్నించారు. మరో సారి తెలివి తేటలులేని పవన్ అని నిరూపించుకున్నారన్నారు. అలాంటి పవన్ను ఏమనాలో నాకు అర్థం కావటంలేదని ఎద్దేవ చేశారు.
నిన్నటి వరకు ఒక మోస్తరుగా పవన్ను విమర్శించిన నేతలు ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. దీనిక కారనం జగన్. గతంలో ఎప్పుడూ పవన్పై జగన్ ఫైర్ అయ్యిందిలేదు. కాని తాజాగా జనసేనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక జగనే దూకుడు పెంచడంతో మిగలిన నేతలందరూ ఇకనుంచి స్వరం పెంచనున్నారు.