మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. అందుకే వైఎస్ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. నా హమారా – టీడీపీ హమారా సభలో తమ డిమాడ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపుతారా అంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి అని, బీజేపీతో ఆయన అంటకాగింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్సేనని అంబటి తెలిపారు. వైయస్ పుణ్యమే పోలవరం ప్రాజెక్టని చెప్పారు. రేపటి తొమ్మిదో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఊరూ వాడా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైయస్ మరణం ఒక విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక అనేక మంది రోదించారని, మరికొందరు ప్రాణాలు కూడా విడిచారని చెప్పారు.