Sunday, May 19, 2024
- Advertisement -

బాబు మీడియాను న‌మ్ముకున్నారు….జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నారు

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ సీనియ‌ర్ నేత సి. రామచంద్ర‌య్య నిప్పులు చెరిగారు. బాబు ఎన్డీఏ నుంచి ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారో తెలిపారు. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌లేద‌న్న కార‌ణంతోనే బాబు ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్‌ జగన్‌ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణమన్నారు. ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలో చేరుతున్నార్న ప్ర‌చారమే దానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

నిరంత‌రం అవినీతిపై మాట్లాడే జేడీకి బాబు అవినీతి క‌నిపించలేదాని ప్ర‌శ్నించారు. టీడీపీలో అవినీతి రాజ్య‌మేలుతుంటే ఆయన‌కు ఎదుకు క‌నిపించ‌లేదోని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి త‌ప్ప‌ద‌నే త‌న ప‌చ్చ‌మీడియాతో జ‌గ‌న్‌పై బుర‌ద జ‌ల్లేందుకు పూనుకున్నార‌న్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారన్న విషయం ఆయన చేపట్టిన పాదయాత్రలోనే స్పష్టమైందని మరోసారి గుర్తుచేశారు. అందుకే బాబు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి బాబు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌ని మండి ప‌డ్డారు. చంద్రబాబు నాయుడు మీడియాను నమ్ముకున్నారని, వైఎస్‌ జగన్‌ ప్రజలను నమ్ముకున్నారని స్పష్టంచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -