Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబువి శవరాజకీయాలు మానుకో… గడికోట శ్రీకాంత్ రెడ్డి

- Advertisement -

కోడెల మరణంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. కోడెల బ్రతికున్నప్పుడు అపాయంట్ మెంట్ కూడా ఇవ్వని బాబు ఆయన మరణించిన తర్వాత శవరాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మానసికంగా వేధించడం వల్లే ఆయన చనిపోయారన్నారు. కోడెలపై కేసులు నమోదయితే బాబు ఎందుకు స్పందించలేదన్నారు.

గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు ప్రాంతంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు చేస్తోందని.. ఓ వర్గాన్ని మాత్రమే చంద్రబాబు పోత్రహిస్తూ కోడెలను అవమానానికి గురిచేశారని పేర్కొన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని సొంత పార్టీ బాధితులే కేసులు పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు కోడెల గుండె పోటుకు గురయ్యారని కనీసం ఒక్క సారైనా ఆయనను పరామర్శించారాని ప్రశ్నించారు.

కోడెల ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు కనీసం పలకరించలేదనీ, ఆయన్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారని గుర్తుచేశారు. టీడీపీ నేత వర్లరామయ్యే కోడెలపై గతంలో తీవ్ర విమర్శలు చేశారన్నారు. పార్టీ సమావేశాలకు సైతం చంద్రబాబు కోడెలను ఆహ్వానించలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కోడెల క్యారెక్టర్ ను కించపర్చింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -