Sunday, May 19, 2024
- Advertisement -

శివాజీ నిన్ను చంపేస్తారు…ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌లన వ్యాఖ్య‌లు

- Advertisement -

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న పుల‌ముకుంది. ఇప్ప‌టికే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న అంతా ఆప‌రేష‌న్ గ‌రుడ చుట్టూ తిరుగుతోంది. ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను తెర‌పైకి తెచ్చింది హీరో శివాజీ అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వైసీపీ మ‌హిళా నేత ల‌క్ష్మీపార్వ‌తి హీరో శివాజీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

శివాజీ స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ, సినిమాల్లోని జోకర్ కు తక్కువని ఎద్దేవా చేశారు. టీడీపీ డైరెక్షన్ లోనే శివాజీ ఆపరేషన్ గరుడ డ్రామాను నడిపిస్తున్నారని చెప్పారు. సెటైర్లు వేస్తూనే శివాజీనీ హెచ్చ‌రించారు. ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీని టీడీపీ నేతలు బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

టీడీపీ నేతలు అతన్ని చంపేస్తారని, ఆ తర్వాత హత్య చేసింది వైసీపీ అంటూ మరో డ్రామాకు తెరతీస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్న స్థాయి నటుడైన శివాజీని రాజకీయ చదరంగంలోకి లాగారని… ఏదో ఒక రోజు అది అతని మెడకే ఉచ్చుగా మారుతుందని జ్యోష్యం చెప్పారు. తనపై జరుగుతున్న కుట్రలను పసిగట్టి శివాజీ జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -