వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. మరో సారి టీడీపీ పార్టీ ఫిరాయింపులకు తెరలేపుతోందని ఆరోపించారు.ఇదే విషయంపై ప్రసిడెంట్ రామ్నాద్కోవింద్ను కలసి ఫిర్యాదు చేశారు. వైసిపి ఎంఎల్ఏలు గనుక టిడిపిలోకి వస్తే ప్రతీ ఎంఎల్ఏకు రూ. 25 కోట్లు ఇస్తామని టిజి ఆఫర్ చేసినట్లు మండిపడ్డారు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుతో పాటు ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ఆఫర్ చేస్తున్నట్లు రెడ్డి ధ్వజమెత్తారు. సమయం వచ్చినపుడు టిజి వెంకటేశ్, టిడిపి బండారం మొత్తాన్ని బయటపెడతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్ లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 74,75 ను వారు అతిక్రమిస్తున్నారనే విషయాన్ని కోవింద్ కు వివరించి చెప్పినట్టు పేర్కొన్నారు.
గన్ తలపెట్టిన పాదయాత్ర, ఆయన బాగోగులు గురించి రామ్ నాథ్ అడిగారని చెప్పారు. చంద్రబాబునాయుడు లా తామేమీ అవినీతికి పాల్పడటం లేదని, ప్రతివిషయంలో లంచాలు తీసుకోవడం లేదని, చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని అన్నారు. అలాంటప్పుడు మాపై చంద్రబాబు ఆరోపణలు చేయడం, ఖబడ్డార్’ అని అనడం సబబు కాదని, ఆయన ఏం చేసుకుంటారో అది చేసుకోవాలనివిజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.