Friday, April 19, 2024
- Advertisement -

చిట్టినాయుడూ అంటూ లోకేష్‌పై విజ‌య‌సాయి అదిరిపోయే సెటైర్లు

- Advertisement -

టీడీపీ రాజకీయాలు, మంత్రి లోకేశ్‌, సీఎం చంద్ర‌బాబుకు ట్విట్ట‌ర్‌లో నిద్ర రాకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. ఎప్ప‌టి క‌ప్పుడు బాబు, లోకేష్‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూనే ఉంటారు. తాజాగా లోకేష్‌పై అదిర‌పోయే సెటైర్ వేశారు. తెలంగాణలో కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి లోకేశ్‌కు నిద్రపట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకొని సీఎం కుర్చీని లేదా పార్టీ బాధ్యతలను తనకు అప్పగిస్తే బాగుండని కలలుకంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టినాయుడికి.. అంటూ ఎద్దేవాచేశారు.

ప్ర‌జ‌ల్లో టీడీపీపై పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌ని అందుకే తూర్పుగోదావరి జిల్లా కట్టమూరులో మంత్రి లోకేశ్‌ను మహిళలు తరిమికొట్టార‌న్నారు. వచ్చే మూడునెలలు పచ్చ పార్టీ నేతలకు ఇటువంటి పరాభవాలు తప్పవు. అంటూ వరుస ట్వీట్లలో సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -