వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి ట్విట్టర్లో పవన్పై రెచ్చిపోయారు. ప్యాకేజీకి న్యాయం చేయడానికి పవన్ గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక మాట …తెలంగాణాలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు, పవన్కు జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారాన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా
ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా అంటూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.