ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇప్పటినుంచె పార్టీలు సన్నధ్దమవుతున్నాయి. ఆ ఎన్నికలకు నాందిగా నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలే పునాదిగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండవ సారి అధికారంలోకి రావడానికి టీడీపీ పట్టుదలతో ఉంటె….ఈ సారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతి పక్ష వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి ఏమోగాని…వైసీపీకి చావులాంటివే.
పార్టీ అధికారంలోకి రావాలంటె ఆ పార్టీకి స్టార్ క్యాంపెన్లు కావాలి. వైసీపీకి జగన్ ఐకాన్ అయితే ఇప్పుడు మరో ఇద్దరు చేరారు. వారిలో ఒకరు పార్టీకి మహిళా ఫైర్బ్రాండ్ రోజా కాగా….మరొకరు పార్టీ సలహాదారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఈ ఇద్దరే పార్టీని ముందుకు నడిపంచనున్నారు. పీకె తెరవెనుక వ్యూహాలు రచిస్తుంటె…రోజా తెరమీద దూసుకుపోతున్నారు.
ప్రశాంత్ కిషోర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్రమోదీ 2014న అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించడంతో పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో దిట్ట. అందుకే జగన్ 2019 ఎన్నికలకు ప్రధాన సలహాదారునిగా ప్రశాంత్ కిషోర్ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికె తన పనిని మొదలు పెట్టారు .
ఎన్నికల్లో ప్రచారం కాన్నుంచి….సీట్ల కేటాయింపు వరకు అన్నీ పీకె కనుసన్నల్లో జరగనున్నాయనడంలో సందేహంలేదు. తన టీంలతో అన్ని జిల్లాల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ గెలుపు పరిస్థితులు ఎలా ఉన్నాయొ అంచనా వేసి ఒక రిపోర్ట్ను జగన్కు ఇచ్చినట్లు తెలిసిందే. ఏ నియేజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది… ఎక్కడ బలంగా ఉంది…గెలుపు గుర్రాలు ఎవరనే దానిమీద సర్వేలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ మహిళా ఫైర్బ్రాండ్ ఎవరంటె ముందుగా గుర్తుకొచ్చేది రోజా.. జగన్ తర్వాత ప్రతిపక్షాన్ని ధీటుగా సమాధానం చెప్పడంలో రోజా నెంబర్ 2 అని చెప్పవచ్చు. తన మాటల తూటాలతో టీడీపీ నాయకుల కు ముచ్చెమటలు పట్టించడంతోపాటు ప్రజలల్లో దూసుకు పోతోంది రోజా. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ తర్వాత ….రోజా ప్రచారమే హైలెట్గా ఉంది. తన వాగ్ధాటి మాటలతో ఎన్నికల ప్రచారంలో తన మార్క్ను చూపించింది.
నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన వెంటనె కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంది .సినిమా డైలాగ్లతో ప్రచారంలో ప్రారంభించింది. సినిమా డైలాగ్లతో ప్రచారంలో దూసుకపోతోంది. నంద్యాల, కాకినాడలో వైసీపీ గెలిస్తే మరింత దూకుడుతో ముందుకు వెల్లనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తర్వాత రోజా, పీకేలే ప్రధాన పాత్రపోషించనున్నారనడంలో సందేహంలేదు. మరి చూడాలి తెరవెనుక పీకే….తెరముందు తన మార్క్ను ఎలా చూపించి వైసీపీని అధికారంలోకి తెస్తారో లేక చితికిల బడతారో వేచి చూడాలి.