చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు దూకుండు పెంచారు. ఆయనపై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా సవాల్ విసిరారు. తన సొంత సోదరుడు రామ్మూర్తి నాయుడిని సర్వనాశనం చేసింది బాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో తనకు టికెట్ ఇవ్వాలని ఎన్టీఆర్ వద్దకు రామ్మూర్తి రాగా…టికెట్టు ఇవ్వవద్దని బాబు చెప్పారని కాని లక్ష్మీ పార్వతి కలగజేసుకొని టికెట్ ఇప్పించారన్నారు. అన్న చేసిన నమ్మకద్రోహంతో ఆయన మతి పోయిందన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో ఎవరికీ తెలియదని, నేడు ఆయన్ను గొలుసులతో కట్టేసి, ఒక రూములో బంధించి వుంచారని అన్నారు. బాబుకు దమ్ముంటె ఆయన్న ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు.
తనను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని ఓ ఇంటర్యూలో తెలిపారు. చంద్రబాబు సొంత సోదరి కూతురినే తనకు ఇచ్చి వివాహం చేశారని గుర్తు చేసుకున్న ఆయన, చంద్రబాబే దగ్గరుండి పెళ్లి చేశారని చంద్రబాబు సొంత సోదరి కూతురినే తనకు ఇచ్చి వివాహం చేశారని గుర్తు చేసుకున్న ఆయన, చంద్రబాబే దగ్గరుండి పెళ్లి చేశానన్నారు. తననే చాలా ఇబ్బందులు పెట్టి, కష్టాలు పెట్టారన్నారు.
తనను ఆర్థికంగా కుంగదీయాలని చంద్రబాబు చూశారని, అయినా తాను లొంగకుండా పైమెట్టు మీదనే ఉన్నానని చెప్పారు. చంద్రబాబు కుటుంబంలో తనతో పాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరని అన్నారు. సొంత చెల్లెళ్ల ఇంట్లోనే దీపం పెట్టలేని ఆయన, ఆంధ్రరాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఇళ్లలో దీపాలేం పెడతారని నిప్పులు చెరిగారు.