Thursday, April 25, 2024
- Advertisement -

గిన్నిస్​ బుక్ ఆఫ్​ వర్డల్​ రికార్డుల్లో మరో భారతీయుడు..!

- Advertisement -

దుబాయ్​లోని భారత సంతతికి చెందిన 12ఏళ్ల సిద్ధాంత్​ గుంబర్​ ​ గిన్నిస్​ బుక్ ఆఫ్​ వర్డల్​ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. కేవలం ఒకే నిమిషంలో 39 విమాన సర్వీసు సంస్థల చిహ్నాలను గుర్తించి ఔరా అనిపించాడు. చకచకా చెప్పి గిన్నిస్​ బుక్​లో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

హరియాణాకు చెందిన గుంబర్​ గతంలో ‘ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​’లో చోటు సంపాదించాడు. ఇంతకుముందు.. అతి చిన్న వయసులోనే ప్రపంచంలోని అతిపెద్ద భవంతులను, వాటి ప్రదేశాలను గుర్తుంచుకొని చెప్పడం విశేషం. ఇటీవల జరిగిన ‘ఎయిర్​ప్లేన్​ టైల్​’ క్విజ్​తో గిన్నిస్​ బుక్​లోకి ఎక్కాడు.

వివిధ రకాల సంజ్ఞలను గుర్తించడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. ఇందుకు అమ్మానాన్న సహకరించారు. ఇందుకు ప్రత్యేకించి నాన్న రకరకాల గుర్తులను రూపొందించేవారు. రాకెట్లు, భవనాలు, వాహనాలు ఇలా చాలానే చూపించేవారు. ఈ విధంగానే విమాన సంస్థల చిహ్నాలను గుర్తించగలిగాను అని సిద్ధాంత్​ గుంబర్​​ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -