Monday, April 29, 2024
- Advertisement -

హీరోయిన్ బిందు మాధవి గుర్తుందా ?

- Advertisement -

తెలుగులో ఆవకాయ బిర్యాని మూవీతో ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి బిందుమాధవి. మొదటి సినిమాలో చక్కనైన కట్టు బొట్టుతో ఆకట్టుకుంది. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగు లో అడపాదడపా సినిమాలో కనిపించిన సరైన బ్రేక్ దొరకలేదు. తర్వాత ఈ తెలుగు బ్యూటీ తమిళ సినిమాల అవకాశాలతో బిజీ అయి పోయింది. చాలా కాలం తర్వాత మీడియాలో కనిపించి తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

తెలుగులో బంపర్ ఆఫర్ – ఓం శాంతి – రామ రామ కృష్ణ కృష్ణలాంటి సినిమాల్లో అటు గ్లామర్ తోను ఇటు నటనతోను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిందు తెలుగులో కనిపించిన చివరి సినిమా పిల్ల జమిందార్. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఈ భామ కనిపించలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన బిందు మాధవి ఇకనైనా కెరీర్ ని చక్కదిద్దుకునే ఆలోచనలో ఉందట. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చింది.

తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ.. నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది. ఇంకా కమిట్ కాలేదు. అయితే ఆ విషయం ఇప్పుడే బయటికి చెప్పలేను అంటుందట. బయటకు చెప్పితే ఇక మీడియాలో దున్నేస్తారంటుంది. ప్రస్తుతానికి మాత్రం సింగిల్.. అనే జవాబిస్తుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. తెలుగులో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది బిందుమాధవి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -