దేశంలో రిలయన్స్ జియో దెబ్బకు మిగిలిన టెలికం కంపెనీలన్ని రోజుకో ఆఫర్తో జియో కి పోటీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగా జియో ఉచిత వెల్ కం ఆఫర్ను డిసెంబర్ 31 నుంచి మార్చి 31, 2017 వరకు పొడిగించగా, ఇప్పుడు ఆ ఆఫర్ను మే 31 వరకు పొడిగించింది.
ఈ దెబ్బతో.. ఐడియా, ఎయిర్ టెల్ కుదేలవుతున్నాయి. ఈ రెండు కంపెనీల నెట్ టర్నోవర్ దారుణంగా పడిపోయింది. ఇది ఇలా ఉంటే.. ఇక బీఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. రూ.786తో రీచార్జ్ చేసుకుంటే రూ. 900 టాక్టైంతో పాటు 300 ఎంబీ ఉచిత ఇంటర్నెట్ డాటా రానుంది.
ఈ ఆఫర్ జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. మరో ఆఫర్లో… రూ.500తో రీచార్జ్ చేసుకుంటే రూ.600 టాక్టైం రానుంది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 15తో ముగియనుంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ ఆఫర్స్ ప్రకటించారు. మరింత సమాచారాన్ని 9490190866కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Related