Wednesday, May 8, 2024
- Advertisement -

ఒక్క దెబ్బతో మెగా ఫ్యామిలీని షేక్ చేసి పడేసిన రోజా….. అటు తిరిగి ఇటు తిరిగి భలే ఇరకాటంలో పడ్డారే?

- Advertisement -

దట్ ఈజ్ రోజా…….ఎవరో వ్యూహం పన్నారు? రోజా కూడా బలంగానే ఇరుక్కుంది. అయితేనేం ఇప్పుడు ఇరికించాలనుకున్నవాళ్ళకే తలబొప్పి కట్టేలా చేస్తోంది. మెగా ఫ్యామిలీ మొత్తం డ్రామాలు బయటపడాల్సిన పరిస్థితి. మన దగ్గర అవకాశవాద రాజకీయ నాయకులకు కొదవే లేదు. తమ్ముడు ఒక పార్టీలో, అన్నయ్య మరొక పార్టీలో ఉంటూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ కుటుంబ సభ్యులందరూ అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న తప్పులు దొరికిపోకుండా చట్టం నుంచి రక్షణ పొందుతూ ఉంటారు. రాజకీయంగా తిట్టుకుంటూ ఉనన్నట్టుగా కనిపిస్తూ జనాలను మాత్రం వెర్రి వెధవలను చేస్తూ ఉంటారు. ఇలాంటి డ్రామాలు మెగా ఫ్యామిలీలో అన్నీ ఇన్నీ కావు.

కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీని అమ్మెయ్యడం పవన్‌కి అస్సలు ఇష్టం లేదు, చిరంజీవితో పవన్‌కి గొడవలు, మెగా ఫ్యామిలీ మొత్తం ఒక పక్క……పవన్ ఒక్కడూ ఒక పక్క….అందరూ కలిసి పవన్‌ని ఒంటరివాడిని చేశారు……ఇలాంటి రూమర్స్ పవన్ క్యాంప్ నుంచి చాలానే వచ్చాయి. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు పవన్ కూడా అలానే మాట్లాడేవాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే పవన్ మాటలకు మరికాస్త సెంటిమెంట్ జోడించి నాటకీయంగా పవన్ గురించి చాలా మాటలు చెప్పేవాడు. అలాగే అల్లు అరవింద్‌ని పవన్ విమర్శిస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ కూడా పవన్ అంటే పడనట్టుగానే కొన్ని మాటలు వదుల్తాడు. ప్రతి సారీ మెగా ఫ్యామిలీలో ఇలాంటి విభేదాలు ఉన్నాయని మీడియాకు ఫీలర్స్ వదులుతూ ఉంటారు. కానీ సినిమాల వరకూ చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా అల్లు ఫ్యామిలీతో సహా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటే. ఇక మిగతావన్నీ జనాలను, అభిమానుల్లో సెంటిమెంట్‌ని రాజేస్తూ రసవత్తరంగా నడిపిస్తున్న డ్రామాలు అంతే. ఆ రాజకీయం ఏంటంటే……..

బాలకృష్ణ, చిరంజీవిలు తెరవెనుక చాలా గొప్ప స్నేహితులు. కానీ ఫాంలో ఉన్నంత కాలం కూడా ఆయా హీరోలు ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవాళ్ళు. కులాల గొడవలు కూడా రేకెత్తేవి. కానీ ఎప్పుడూ కూడా తెరముందుకు వచ్చి ఆ ఇద్దరు హీరోలు అభిమానులకు గట్టిగా ఒక సందేశం వినిపించింది లేదు. ఇంకా ఆ గొడవలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గొడవల సందర్భంగా ఆయా హీరోల గొప్పల గురించి వాదించుకుంటూనే అభిమానులు కాస్తా ఆయా హీరోలకు వీరాభిమానులు అవుతూ ఉంటారు మరి. అప్పుడు వేర్వేరు కులాల, కుటుంబాల హీరోలు అయితే ఇప్పుడు క్రికెట్ టీం అంత ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలే అలాంటి గొడవలను రాజేస్తున్నారు. చిరంజీవిని భయంకరంగా పొగిడేసిన పవన్ కళ్యాణ్….అల్లు అరవింద్‌ని చాలానే విమర్శించాడు. ఆయన్ను నేరస్తుడ్ని చేసిపడేశాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజే చిరంజీవి, అల్లు అరవింద్‌లు కావాలనే ఒక ప్రోగ్రాంకి కలిసి వచ్చారు. దాని చుట్టూ మెగా ఫ్యామిలీ ఫీలర్స్ వదలడం. ఇక పవన్-త్రివిక్రమ్‌ల సినిమాకు హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని తీసుకోమని చెప్పింది అల్లు అర్జునే. ఇప్పుడు ఆ హీరోయిన్ డేట్స్ అన్నీ కూడా అల్లు అరవింద్ చేతుల్లోనే ఉన్నాయి. అందరు మెగా హీరోల సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ అల్లు అరవింద్ హస్తం ఉంటుంది. ఈ మొత్తం డ్రామాల గురించి ఇండస్ట్రీ జనాలకు ఇంకా బాగా తెలుసు. అయితే అందరూ కూడా డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఒకే మాట మీద ఉంటారు.

ఇప్పుడు రోజా పుణ్యమాని వీళ్ళ అసలు రంగు బయటపడాల్సిన టైం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పైన ఇతర ఏ మెగా ఫ్యామిలీ పర్సన్ కూడా చూపించినంత అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు నాగబాబు. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్‌ ‘పక్కల’ వ్యవహారం గురించి రోజా చాలానే మాట్లాడేసింది. అలాగే పవన్‌ని వాడు, వీడు అంటూ రెచ్చిపోయింది. మరి ఇప్పుడు నాగబాబు ఏం చేస్తాడు? పవన్‌ని ఆ స్థాయిలో తిట్టిన రోజా పక్కన జడ్జ్‌గా కూర్చుని జబర్ధస్త్‌ని ఎంజాయ్ చేస్తాడా? డబ్బుల కోసం పవన్‌ని తిట్టిన వాళ్ళతో కలిసి కూడా వర్క్ చేస్తాడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. సమాజంలో ఉండే మామూలు జనాలు కూడా కుటుంబ సభ్యులను విమర్శించినవాళ్ళతో కలిసి తిరగడానికి సిగ్గు పడతారు. పవన్‌పై అమితమైన ప్రేమ ఉందని చెప్పుకునే నాగబాబు ఇఫ్పుడేం చేస్తాడు? తనకు దైవంతో సమానం అన్యయ్య చిరంజీవి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అదే చిరంజీవికి వ్యతిరేకంగా తన ‘కమిట్మెంట్’ కోసం పొలిటికల్ ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు నాగబాబు కూడా తన పేమెంట్ కోసం రోజాతో కలిసి జబర్ధస్త్ జడ్జ్‌గా కంటిన్యూ అవుతాడా? పవన్ అభిమానులు మాత్రం రోజాను విమర్శించడానికి, తిట్టడానికి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని మరీ రోజా సపోర్టర్స్‌తో ఫైట్ చేస్తూ కెరీర్స్‌ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్‌పై తన అభిమానం గురించి, పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాటలు చెప్పే నాగబాబు మాత్రం నాలుగు డబ్బుల కోసం అదే రోజాతో కలిసి నవ్వుతూ షో చేస్తూ ఉంటాడా? మెగా ఫ్యామిలీ రాజకీయాలు, డ్రామాలన్నీ ఈ దెబ్బతో అభిమానులకు కూడా అర్థమయిపోయేలాగే ఉన్నాయి.
మూడు రోజుల రాజకీయ షో అట్టర్ ఫ్లాప్ అయ్యి పవన్ అసలు రంగులు, అజ్ఙానం మొత్తం జనాలకు అర్థమై పోయిన నేపథ్యంలో పవన్ క్రేజ్ పెంచాలని ఆయన భజన మీడియా చేసిన ప్రయత్నం పుణ్యమాని ఇప్పుడు మెగా ఫ్యామిలీనే అడ్డంగా ఇరుక్కుంది. ఇకపైన కూడా అల్లు అరవింద్‌తో కలిసి తెరవెనుక సినిమా వ్యవహారాలు చేస్తూ, కలిసి ఉంటూ, మెగా బ్రదర్స్ అందరూ ఒక్కటిగా ఉంటూ …….తెర ముందు మాత్రం డబ్బుల కోసం డ్రామాలు ఆడితే వాళ్ళ అభిమానులకు కూడా అసలు విషయాలన్నీ క్లియర్‌గా అర్థమవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -