Thursday, May 9, 2024
- Advertisement -

ఆ స్టార్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న’కార్తీకదీపం’ సౌందర్య!

- Advertisement -

కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై… ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న ఈ సౌందర్య అలియాస్ అర్చన… కేరాఫ్ అనసూయ అంటూ తనే లీడ్ రోల్ తో సీరియల్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై అద్భుతమైన పాత్రలో నటిస్తున్న ఈ భామ వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది.

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ లీడ్ రోల్ లో నటిస్తున్న”థాంక్యూ బ్రదర్”సినిమాలో ప్రత్యేక పాత్రలో అర్చన నటిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, అశ్విన్ జె విరాజ్ ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమాలు అనసూయ గర్భవతిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అశ్విన్, అనసూయ లిఫ్టులో వెళ్తున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లిఫ్ట్ పనిచేయకపోవడంతో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అనసూయను అశ్విన్ ఏవిధంగా కాపాడాడు? ప్రెగ్నెంట్ గా ఉన్న అనసూయ బిడ్డకు జన్మనివ్వడానికి అశ్విన్ ఏం చేశాడు అనేది ఈ సినిమాలో కథ అవ్వగా ట్రైలర్ ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాలో అర్చన అశ్విన్ తల్లి పాత్రలో నటించింది.

ఇప్పటికే బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకున్న అర్చన సినిమాలలో అవకాశం వస్తే నటిస్తానని ఓ సందర్భంలో తెలియజేశారు. ప్రస్తుతం అర్చనకు “థాంక్యూ బ్రదర్” సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా ద్వారా వెండితెరపై సందడి చెయ్యడానికి సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమాతో అర్చన మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

రికార్డుల మోత మోగిస్తున్న ఆచార్య..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -