Sunday, April 28, 2024
- Advertisement -

కరోనా వైరస్‌ను సబ్బు వల్ల ఎలా చనిపోతుందో తెలుసా ?

- Advertisement -

కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక రాచకొండ పోలీసులు ఇటీవల రోడ్లపై సిగ్నళ్ల వద్ద కూడా చేతులు ఎలా కడుక్కోవాలనే అంశాన్ని చేసి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోశల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాక, రాచకొండ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలూ చేపడుతున్నారు.

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతున్నారు. తాజాగా మరో వీడియోని రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శానిటైజర్లు లేకపోయినా సబ్బుతో చేతులు కడుక్కోవచ్చని దాన్ని ఎలా అందుబాటులో ఉంచుకోవాలనే విషయాన్ని వివరించే ఓ వీడియో షేర్ చేశారు. కరోనా వైరస్‌ను సబ్బు ఎలా నిర్మూలిస్తుందో ఆ వీడియోలో ఉంది. సాధారణంగా వైరస్‌లు ఫ్యాటీ లేయర్ కలిగి ఉంటాయని, ఇవి సాధారణ నీటికి లొంగవని ఆ వీడియోలో ప్రయోగాత్మకంగా వివరించారు.

దానికి సబ్బు తోడైతే అందులోని, ఫ్యాటీ లేయర్‌ను విచ్ఛిన్నం చేసే గుణాలు క్రిములను సర్వనాశనం చేస్తాయని చూపించారు. ‘‘శానిటైజర్ లేకపోతే సబ్బును జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను ముందూ వెనుక కడుక్కోవటం మర్చిపోవద్దు’’ అని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -