Friday, May 3, 2024
- Advertisement -

ఈ ఆదివారం బుల్లితెర మొగుడెవరు..?

- Advertisement -

బిగ్ స్క్రీన్ మీద ఫైట్ చేసుకోలేని చిత్రాలన్నీ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఫైట్ కు సిద్ధ పడుతున్నాయి. ఇందుకోసమని వచ్చే ఆదివారాన్ని వేదికగా చేసుకున్నాయి.ఈ సారి సండేకు బుల్లితెరపై నువ్వా నేనా అని ఆ నాలుగు సినిమాలు తేల్చుకోబోతున్నాయి.

ఈ పోటీలో నిలబడిన నాలుగు చిత్రాలు బడా వెంచర్లే కావడం విశేషం. వాటిలో ముందుగా చెపుకోవల్సింది.. కాటమరాయుడు .ఈ చిత్రం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. పవన్ సినిమా కావడంతో ఫ్యాన్స్ పరంగా మంచి రేటింగ్ వస్తుందని అంచనా వేయవచ్చు.

ఇక స్టైలిష్ స్టార్ చిత్రం.. డిజే వరుసలో తర్వాతి ఉంది. 16కోట్ల కు శాటిలైట్స్ సొంతం చేసుకున్న జీ తెలుగు ఈసినిమాను ప్రతిష్టాత్మకంగా ఆదివారం ప్రసారం చేయనుంది. వీరిద్దరికి పోటీగా వచ్చి రెండేళ్లు అయిన రుద్రమదేవి రిలీజ్ కానుంది. ఈసినిమాను శాటిలైట్స్ రైట్స్ తో ఎవరు తీసుకుంటారా అని అనుకున్నారంతా. కాని చివరకు ఈటివి వారు స్వీకరించడం..ఆ సినిమాను ఈ సమయంలో వేయడం కాస్త కామెడీనే అయినా..నేను ఉన్నాను అని చెపుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఫిలింను టెలికాస్ట్ చేస్తున్నట్లుగా భావించాలి.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ …నేనే రాజు నేనే మంత్రి . ఈసినిమా వచ్చింది రీసెంట్ గానే కావడంతో జనాల్లో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీని మా టివి వారు ప్రసారం చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రసరమయ్యే ఈ నాలుగు చిత్రాల్లో ఈ సినిమానే బెటర్ అని చెపుకోవాలి. కాని బుల్లితెర ప్రేక్షకుల మైండ్ సెట్ అంతగా అందరికీ తెలియదు కాబట్టి.. టిఆర్ పి రేటింగ్స్ వస్తే గాని ఎవ్వరు తోపో చెప్పలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -