Sunday, May 5, 2024
- Advertisement -

కవితను ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు ఎవరు..?

- Advertisement -

కవిత.. ఈమె తెలుగులో చాలా మందికి తెలిసిన ప్రముఖ నటి. పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ,మలయాళ భాషలలో కూడా నటించింది. దగ్గర దగ్గర 200 కు పైగా సినిమాల్లో ఈమె నటించింది. బుల్లితెరపై కూడా ఈమె నటించింది.

పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో కవిత జన్మించింది. కవిత 6ఏళ్ళు ఉన్నాప్పుడే మద్రాస్ కుటుంబం వచ్చేసింది. అయితే ఈమే తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో.. కుటుంబం రోడ్డున పడింది. దాంతో చదువుకోవడం కోసం కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేదు. దాంతో మద్రాసులో తెలుగువారికి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో ఈమె చదువుకుంది. ఆ టైంలో కవిత తండ్రికి కృష్ణయ్య అనే నిర్మాత పరిచయం అయ్యారు. ఆ టైంలో కవితను చూసి.. బాగున్నావ్.. సినిమాలో నటిస్తావా అని అడిగారు. అప్పుడు ఆమె.. చదువుకోవాలి.. నటించడం కుదరదు అనేసింది. కానీ ఆమె తండ్రి బలవంతం మీద ‘ఓ మంజు ‘ అనే తమిళ సినిమాలో 11 ఏళ్ళ వయస్సులో కథానాయికగా నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో.. ఈమెకు వరస అవకాశాలు వచ్చాయి. తెలుగులో సిరిసిరిమువ్వ సినిమాలో జయప్రదకు చెల్లెలి పాత్రలో ఫస్ట్ టైం కనిపించింది. ఇక హీరోయిన్ గా మాత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాలో నటించింది.

1984 లో, 19 ఏళ్ళ వయస్సులో ఈవిడ పెళ్లి.. సింగపూర్ వ్యాపారవేత్త దశరథరాజ్ తో జరిగింది. ఈవిడకు ముగ్గురు కుమార్తెలు సంతానము. అయితే ఇటివలే ఈమె ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొంది. ఈ షోలో షాకింగ్ నిజాలు చెప్పింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్ కవితను అవమానించడట. అవమానించడం అంటే మాములుగా కాదు ఓ రెంజ్ లో అవమానించాడట. దాంతో ఆమె 16 ఏళ్ల వయసులో ఆ దర్శకుడితో పని చేయొద్దు అని ఫిక్స్ అయ్యిందట. ఇప్పటికి ఆ దర్శకుడు సినిమా తీస్తునే ఉన్నారట. మళ్లీ ఎప్పుడైన ఆ దర్శకుడిని కలిసారా అని ఆలీ అడగటంతో.. కలిసా.. కానీ అతను మాట్లాడే మాట తనను ఎంతగానో బాధించిందట. ఈ విషయాలు చెప్పుకుంటు కవిత తెగ ఏడ్చేసింది. కవిత ఆ రేంజ్ లో కంటతడిపెట్టుకుందటే.. ఆ దర్శకుడు కవితను ఏ రెంజ్ లో ఇబ్బంది పెట్టాడో అర్దం అవుతుంది. మరి ఇప్పటికి సినిమాలు డైరెక్ట్ చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరో అని అందరూ ఆలోచనలో పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -