Thursday, April 25, 2024
- Advertisement -

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి..?

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడకుండా ఉండాలని ప్రతి ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పనిసరిగా ఈ పానీయం సేవించాలని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

మన ఇంట్లో దొరికే కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేసుకొనే ఈ పానీయం తాగటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మన ఇంట్లో దొరికే పసుపు, మిరియాలు, తులసి ఆకులు, లవంగాలు దాల్చిన చెక్క, అల్లం ముక్క ద్వారా తయారు చేసుకునే పానీయం ప్రతిరోజు తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Also read:60 ఏళ్లకు జీవితం అయిపోయిందని చెప్పింది ఎవరు?

ఒక లీటర్ నీటిలోకి ఈ సుగంధ ద్రవ్యాలు అని వేసుకుని తయారు చేసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమేకాకుండా జలుబు, దగ్గు వంటి లక్షణాల నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఉపయోగించేవారు వైద్యుల సూచనలు సలహాలు మేరకే ఈ పానీయాన్ని సేవించాలి. ఈ విధమైనటువంటి కషాయం తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Also read:175 కోట్ల రూపాయిల ఇల్లు.. ప్రియుడి కోసమే కొన్న హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -