టాలీవుడ్లో రైటర్ అంటే ఇపుడున్న వారికి పరుచూరి బ్రదర్స్ , త్రివిక్రమ్ లే గుర్తుకు వస్తారు. వారి రాసిందే పంచింగ్ ఫలక్ నామా అనుకున్నారు. ఇపుడు సీన్ మారింది.సీన్ లోకి రకరకాల వ్యక్తులు ఎంటర్ అవుతున్నారు.తమ పదును చూపిస్తున్నారు. తాజాగా బుర్రా సాయిమాధవ్ నే తీసుకుందాం. ఆయనగారు వీరిద్దరినే మరిచిపోయేలా డైలాగ్స్ దంచేస్తున్నారు.
కృష్ణం వందే జగద్గురుం చిత్రంతో అతను ఇచ్చిన ఝలక్ చాలామందికి తగిలింది. ఈసినిమాలో అతన్ని సెలక్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వారు. పోయి పోయి క్రిష్ ఓ సీరియల్ రైటర్ ను తీసుకున్నాడేంటి అని కామెంట్ చేశారు. అతనే గోపాల గోపాల,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి చిత్రాలతో అందరినీ అలరించాడు. కంచె చిత్రంతో అతని కలంలో ఉన్న పవర్ ఏంటో చూపించాడు. కులాల పై ఇప్పటి వరకూ ఎవ్వరూ ఊహించని విధంగా గుండమ్మ కథ రాసినప్పుడు నరసరాజు చమత్కారం,బాపు చిత్రాలకు పని చేసిన టైమ్లో ముళ్ల పూడి కొసమెరుపులకు ధీటుగా బుర్రా చేసిన సింపుల్ పంచ్ లు విశ్లేషకులను అలరించాయి. ఇతని ఊపు చూస్తుంటే.. తెలుగులో మరో గొప్ప రచయితగా ఎదిగిపోతాడా అనిపిస్తుంది.