Monday, April 29, 2024
- Advertisement -

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు శాపంలా మారిన వ‌రుణుడు

- Advertisement -

తాజా ఐపీఎల్ సీజ‌న్‌లో వ‌రుణుడు మొద‌టిసారి మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జ‌ట్టుతో మంగ‌ళ‌వారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే మ్యాచ్ మొద‌లుకాకుండానే భారీగా వ‌ర్షం ప‌డ‌టంతో చాలాసేపు మ్యాచ్‌ను నిలిపేశారు. కాసేప‌టి త‌రువాత వ‌ర్షం ఆగ‌డంతో మ్యాచ్‌ను 5 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ 5 ఓవ‌ర్లు మ్యాచ్‌ను కూడా వ‌ర‌ణుడు పూర్తిగా జ‌ర‌గ‌నియ‌కుండా అడ్డుప‌డటంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు.

ఈ మ్యాచ్ జ‌రిగిన , జ‌ర‌గ‌గ‌పోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జ‌ట్టుకు వ‌చ్చే న‌ష్టం లేదు. కాని ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలి అంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితిలో ఉంది రాజస్తాన్‌ రాయల్స్ జ‌ట్టు. ఇలాంటి స‌మ‌యంలో వ‌ర్షం వారికి శాపంలా మారింది. ఈ మ్యాచ్ ఫ‌లితంతో ఇరు జ‌ట్లు టోర్ని ఫ్లే ఆఫ్‌కు చేర‌కుండానే వెనుదిరిగాయి. టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 5 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసింది. కోహ్లి (25) మెరిపించాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ శ్రేయస్‌ గోపాల్ ఈ సీజ‌న్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. 63 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్ధాన్ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ వ‌ర్షం ప‌డ‌టంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -