కశ్మీర్ విషయంలో ట్విట్టర్ ద్వారా భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిచేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాతో పాటు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మేం ఏం చేయాలో బయట వ్యక్తులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశాన్ని నడిపించే సమర్థవంతమైన వ్యక్తులు మనకు ఉన్నారు. బయట వ్యక్తులు మనకు చెప్పడమేంటి’ అని సచిన్ మండిపడ్డారు.
సోమవారం భద్రతా దళాలు కశ్మీర్లో 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన తరవాత అఫ్రిది తన ట్వీట్కు పనిచెప్పాడు. కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, వారిపై తీవ్రంగా అణచివేత కొనసాగుతోందంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. యూఎన్, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.