- Advertisement -
టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్ 109 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఎనిమిది ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి అఫ్గానిస్తన్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లతో మెరవగా, ఉమేశ్ యాదవ్కు వికెట్ దక్కింది.
అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ నబీ(24)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. షహజాద్(14), జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్జాయ్(11)లు తీవ్రంగా నిరాశపరిచారు.అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది.