ఏషియన్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. టెన్నిస్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో భారత జోడీ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ స్వర్ణ పతకం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో కజక్స్థాన్కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్, డెనిస్ యెవెసెయెవ్ జోడీపై 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్లో రెండు సర్వీస్లను బ్రేక్ చేసిన భారత జోడీ.. రెండో సెట్లోనూ కీలకసమయంలో సర్వీస్ బ్రేక్ చేసి సునాయాస విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం గోల్డ్ మెడల్స్ సంఖ్య 6కు చేరింది.
షూటింగ్లో భారత్కు మరో కాంస్య పతకం దక్కింది. ఈరోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధు కాంస్యాన్ని సాధించారు. ఓవరాల్గా 198.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నారు. దాంతో భారత్ పతకాల సంఖ్య 23కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
Indeed, a Gold-lined morning for #TeamIndia!@rohanbopanna and @divijsharan played a solid Men's Doubles Finals to give India its 6th gold medal of the #AsianGames2018, with a 6-3, 6-4 straight sets win over Kazakh pair of #BublikA and #DenisY! #Congratulations 🎾🇮🇳👏 pic.twitter.com/SUPasHLPvM
— Team India (@WeAreTeamIndia) August 24, 2018