ఖటినమైన సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు సిద్దమవుతోంది. జనవరి 5న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్కు భారత జట్టు సిద్దమవుతోంది. సౌతాఫ్రికా టూర్పై భారత టెస్టు జట్టు ఓపెనర్ మురళీ విజయ్ స్పందించారు. మైదానంలో తన పోరు బంతితోనే తప్ప.. బౌలర్లతో కాదని వెల్లడించారు.
దక్షిణాఫ్రికాతో జనవరి 5 నుంచి మూడు టెస్టుల సిరీస్లో భారత్ తలపడనుంది. దీంతో గత కొద్ది రోజుల నుంచే భారత బ్యాట్స్మెన్ vs దక్షిణాఫ్రికా బౌలర్స్ మధ్య ఆధిపత్య పోరుగా ఈ సిరీస్ని అందరూ అభివర్ణిస్తున్నారు. మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రోహిత్ శర్మలతో నిండిన భారత టాప్ ఆర్డర్ బలంగా ఉంది. టాప్ ఆర్డ్రికి బౌలింగ్ చేయడం.. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్కి గట్టి ఛాలెంజ్ అంటూ హర్భజన్ సింగ్ ఇటీవల అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ గమనానికి అనుగుణంగా నా ఆట ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి బౌలర్కి ఓ శైలి ఉంటుంది. సొంతగడ్డపై అయితే.. అది మరింత పదునెక్కుంది. విదేశీ గడ్డపై పరుగులు చేయడం గొప్ప అనుభూతినిస్తుంది.