Tuesday, April 30, 2024
- Advertisement -

భాజాపాలో చేరిన క్రికెట‌ర్ భార్య‌….

- Advertisement -

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి భారతీయ జనతా పార్టీ కండువా క‌ప్పుకున్నారు. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో రివాబా కాషాయ కండువా కప్పుకున్నారు. గతేడాది నవంబర్‌ 20న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని రవీంద్ర జడేజా, రివాబా కలిసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రవీబా జడేజా తెలిపారు. కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 6 నెల్లకే ఆమె రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది. గతేడాది ‘పద్మావత్’ సినిమాకి వ్యతిరేకంగా గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు చేపట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్‌ లేదా జామ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి రివాబా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -