Sunday, May 19, 2024
- Advertisement -

విజృంభిస్తున్న ముంబ‌య్ బౌల‌ర్లు… క‌ష్టాల్లో ధోనిసేన‌

- Advertisement -

ముంబయి ఇండియన్స్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నైకు ఆదిలోనె బిగ్ షాక్ త‌గిలింది. సొంత స్టేడియంలో భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ధోని సేన పేవ‌ల‌మైన బ్యాటింగ్‌తో వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన లసిత్ మలింగ బౌలింగ్‌లో ఆరు బంతులూ ఆడి ఒక పరుగు మాత్రమే చేసిన చెన్నై ఓపెనర్ డుప్లెసిస్ (6: 11 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే ఔటైపోయాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ విసిరిన బంతిని.. థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్.. ఫీల్డర్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్ చేతికి చిక్కాడు.

అనంత‌రం బ్యాటింగ్‌కు వ‌చ్చిన రైనా కూడా తీవ్ర నిరాశ ప‌రిచాడు. (5: 7 బంతుల్లో 1×4) స్పిన్నర్ జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.దీంతో.. 3.3 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 12/2తో ఒత్తిడిలో పడింది. దూకుడుగా ఆడుతున్న వాట్స‌న్ కూడా 14 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం చెన్నై 10 ఓవ‌ర్ల‌కు మూడు వికెట్లు కోల్పోయి 50 ప‌రుగుల‌తో ఆడుతోంది. క్రీజ్‌లో రాయుడు 7, విజ‌య్ 21 ప‌రుగుల‌తోను ఆడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -