వివాహ బంధంతో ఒక్కటైన విరుస్క దంపతులకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు సోషియల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీపిక మాత్రం విష్ తెలుపలేదు. గతంలో వారిద్దరి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీపిక శుభాకాంక్షలు తెలుపలేదనే వార్తలు వచ్చాయి.
అయితే అనుకోకుండా కొత్త దంపతులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ప్రముఖ బాలీవుడ్ నటీమణి దీపికా పదుకునే ఎట్టకేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపిక, ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న హీరో రణ్వీర్ సింగ్ కలిసి అనుష్క ఇంటికి ప్రత్యేక బహుమతి పంపినట్లు సమాచారం. దీంతోపాటు అందమైన పుష్పగుచ్ఛాన్ని కూడా పంపారట. దానిపై అనుష్క, కోహ్లీలకు శుభాకాంక్షలు చెబుతూ.. రణ్వీర్, దీపికలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు దీపిక శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఆమెకు, అనుష్కకు మధ్య గతంలో ఉన్న విభేదాల వల్లేనన్న పుకార్లు పుట్టాయి. కానీ, తాజా పరిణామంతో వీటికి చెక్ పడింది.