- Advertisement -
టీమిండియా కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఘోరంగా విఫలం అయిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాట్స్ మెన్లు ఉన్నా కననీసం ప్లే ఆఫ్ రేసులో కూడా లేకుండా లీగ్లోనె వెనుతిరిగింది. దీంతో కోహ్లీపై సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా గంభీర్ కోహ్లీపై ఫైర్ అయ్యారు.
కోహ్లి ఆర్సీబీకి మాత్రమే కెప్టెన్గా ఉండాలని, భారత జట్టుకు కాదుని ముందే సూచించానని గంభీర్ అన్నాడు. ఆర్సీబీకి కెప్టెన్గా ఉండటం నిజంగా కోహ్లి అదృష్టమని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఉత్తమ ఆటగాడె కాని కెప్టెన్సీలో మాత్రం కోహ్లి పనికిరాడని అభిప్రాయపడ్డాడు. ఏడేళ్ల పాటు ఒకే జట్టుకు కెప్టెన్గా ఉండి ఒక్కసారి కూడా టైటిల్ తీసుకురాలేదని, అయినా సారథిగా కొనసాగడం అదృష్టమేనని చెప్పుకొచ్చాడు.