భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గురువారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ సారథి మోర్గాన్ ఫీల్డింగ్కు మొగ్గు చూపాడు. ఇక అంతా అనుకున్నట్లే భారత జట్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ను తప్పించి చతేశ్వర పుజారాకు, ఉమేశ్ యాదవ్ స్థానంలో కుల్దీప్ యాదవ్కు అవకాశం కల్పించారు. ఇంగ్లండ్ జట్టులో బెన్స్టోక్స్ స్థానంలో క్రిస్ వోక్స్ వచ్చాడు.
ధావన్ గైర్హాజరితో కేఎల్ రాహుల్, మురళీ విజయ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే మురళీ విజయ్ వికెట్ను కోల్పోయింది. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి మురళీ విజయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం పుజారా క్రీజులోకి వచ్చాడు.అండర్సన్ బౌలింగ్లోనే కెఎల్ రాహుల్ కూడా ఔట్ అవ్వడంతో ఇండియా కష్టాల్లో పడింది.ఈ సందర్భంలో వర్షం మళ్లీ మ్యాచ్కు ఆటంకం కలిగించింది.దీంతో మ్యాచ్ను ఆపేశారు.