Friday, April 26, 2024
- Advertisement -

బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

- Advertisement -

సంతోష్ శోభన్… ఈ పేరు ఇప్పుడు కుర్రహీరోల్లో మార్మోగుతోంది. ఇటీవల ఆయన నటించిన ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఘనవిజయం సాధించింది. బాలనటుడిగా గోల్కొండ హైస్కూల్ తో కెరీర్ మొదలు పెట్టాడు సంతోష్. 2011లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 2015లో సంతోష్ హీరోగా మారాడు. తను నేను అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత 2018 లో ఆయన నటించిన పేపర్ బాయ్ విడుదల అయ్యింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

నటుడిగా సంతోష్ శోభన్ తొలి హిట్ అందుకున్నది మాత్రం ఏక్ మినీ కథతోనే. ఆ సినిమాతో నటుడిగా కూడా మంచి పరిణితి సాధించాడు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ఏక్ మినీ కథ హిట్టుతో సంతోష్ దశ తిరిగింది. ఇప్పుడు బడా బ్యానర్లు సంతోష్ చుట్టూ తిరుగుతున్నాయి. పెద్ద బ్యానర్లు అగ్ర హీరోల సినిమాలతో పాటు లో బడ్జెట్ లో కూడా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రతి అగ్ర నిర్మాణ సంస్థకు చిన్న సినిమాలు తీసేందుకు సపరేట్ గా మరో బ్యానర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాంటి బ్యానర్లు ఇప్పుడు సంతోష్ తో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

సంతోష్ శోభన్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నెలరోజుల్లోనే కంప్లీట్ అయ్యేలా మారుతి ప్లాన్ చేశాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో చిన్న సినిమాలు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన స్వప్న సినిమాస్ వరుస విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ సంతోష్ తో ఓ సినిమా చేస్తోంది. దీంతో పాటు పలు అగ్ర నిర్మాణ సంస్థలు కూడా సంతోష్ శోభన్ తో చిన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయట.

Also Read: జగ్గుభాయ్​.. బాలీవుడ్​ పయనం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -