Wednesday, May 8, 2024
- Advertisement -

దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుపై అభిమానుల ఆగ్రహం

- Advertisement -

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు సఫారి ఆటగాళ్లు పై చేయి సాధించారు. కానీ ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా విభాగం మాత్రం పప్పులో కాలేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్ల సహనానికే పరీక్షగా మారి అర్ధ సెంచరీ సాధించాడు భారత నయావాల్‌ పుజారా. ఈ తరుణంలో పుజారాను అభినందిస్తూ దక్షిణాఫ్రికా బోర్డు చేసిన ట్వీట్‌ భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇంతకీ ఏం ట్వీట్‌ చేసారంటే.. ‘పుజారా కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా నెమ్మదిగా 173 బంతుల్లో సాధించాడు. తొలి పరుగుకే 54 బంతులాడిన విషయం తెలిసిందే’ అంటూ పుజారాకు బదులు అశ్విన్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -