ప్రపంచకప్లో భారత్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే భువనేశ్వర్, రోహిత్ దూరంగా కాగా తాజాగా ఆల్రౌండర్ ఇజయ్ శంకర్ గాయం కారనంగా టోర్నీనుంచి వైదొలిగాడు.నెట్స్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విసిరిన యార్కర్ని అడ్డుకోవడంలో ఫెయిలైన విజయ్ శంకర్ గాయపడి.. టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు.
శంకర్ కాలి వేలికి తీవ్ర గాయమవగా.. పరిశీలించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో అతను ప్రపంచకప్కి దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు సోమవారం తెలిపారు. శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిన చేసిన విషయాన్ని బీసీసీఐ..ఐసీసీకి తెలిపింది.
శిఖర్ ధావన్ స్థానంలో ఇప్పటికే రిషబ్ పంత్ని జట్టులోకి తీసుకోగా.. భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. తాజాగా గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ని సెలక్టర్లు ఎంపిక చేశారు.