తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు టాప్ లేపారు. బ్యాటింగ్, బౌలింగ్ లోను అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.కెప్టెన్ విరాట్ కోహ్లి 895 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ప్రపంచకప్లో ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ 863 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల విండీస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ రాణించిన సంగతి తెలిసిందే.
ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. భారత్ పర్యటలో విఫలమవుతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 694 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లోనూ భారత్ జట్టుకి రెండో స్థానం దక్కింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ 125 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత భారత్ (122), న్యూజిలాండ్ (112), ఆస్ట్రేలియా (111), దక్షిణాఫ్రికా (110) టాప్-5లో నిలిచాయి.