ఇంగ్లండు వేదికగా ఐసీసీ ప్రపంచకప్ సమరానికి ఆసన్నమైంది. ఈ నెల 30 న ఈ మహాటోర్నీప్రారంభం కానుంది. సమరానికి అన్ని జట్లు సిద్దంగా ఉన్నాయి.టోర్నమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి విజేత జట్టుకు అత్యధిక ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. ఈ సారి వరల్డ్ కప్ ఫ్రైజ్ మణీ భారీగా పెరిగింది.
ఏడాది ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్కప్లో.. ఫైనల్ విజేతకు 28 కోట్ల క్యాష్ అవార్డు ప్రజెంట్ చేయనున్నారు. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ టీమ్ విజేతకు క్యాష్ అవార్డుతో పాటు ట్రోఫీని కూడా బహూకరిస్తారు. లార్డ్స్లో జూలై 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ కోసం మొత్తం 10 మిలియన్ల డాలర్లు ప్రైజ్మనీ కేటాయించారు. వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచే జట్టుకు 14 కోట్ల ప్రైజ్మనీ వస్తుంది.సెమీఫైనల్ చేరిన జట్లకు 8 లక్షల డాలర్లు(5 కోట్ల 61 లక్షలు) ఇస్తారు. ప్రపంచకప్ 46 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది.