ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగన మ్యాచ్లో టీమిండియా అద్భతంగా రాణించి ముందుకెల్తోంది. భారత జట్టు విజయాలపై క్రికెట్ దేవుడు సచిన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో తన మనసులో మాటను బయటపెట్టారు.
ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక శతకాలు సాధించిన క్రీడాకారుడిగా తన పేరిట ఉన్న రికార్డుని.. టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ అధిగమిస్తే చూడాలని ఉందన్నారు సచిన్. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించిన ధావన్.. సెంచరీతో చెలరేగి పోయాడు. అయితే, ప్రపంచకప్లో శిఖర్ ధావన్కు ఇది మూడో శతకం కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం కలిపి ఆరోది. ఐసీసీ టోర్నమెంట్లలో కుమార సంగక్కర, రికీ పాంటింగ్లతో సమానంగా ఆరు శతకాలు సాధించాడు. వీరికన్నా ముందు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ ఏడు శతకాలు సాధించిన వారిగా ముందున్నారు.