వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇవాల విస్టీండిస్, పాక్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా పాకిస్థాన్తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కీలక ఆటగాళ్లు ఎవిన్ లూయిస్, షానన్ గాబ్రియెల్ ఫిట్గా లేకపోవడంతో మ్యాచ్కు దూరమైనట్లు చెప్పాడు.
ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. ఈ మ్యాచ్లో గెలిచి బోణి కొట్టాలని ఆశిస్తోంది. మరోవైపు.. న్యూజిలాండ్పై వార్మప్ మ్యాచ్లో 421 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు అదే జోరుని పాక్పై కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మెగా టోర్నీకి ముందు ఆడిన 11 వన్డేల్లో ఒక్క మ్యాచ్లోనూ పాక్ నెగ్గలేదు. ఈ ఒత్తిడి నుంచి బయటపడి.. ఇంగ్లీష్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ అదే స్ఫూర్తితో స్పూర్తిదాయక ప్రదర్శన చేయాలని భావిస్తోంది. పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఫిట్నెస్ సాధించిన పేసర్ మహ్మద్ ఆమీర్ ఎట్టకేలకు ప్రపంచకప్లో అరంగేట్రం చేయబోతున్నాడు. విండీస్ హిట్టర్లను పాక్ బౌలర్లు నిలువరిస్తారేమో చూడాలి.