భారత్ – ఆసీస్ మధ్య ఇవాళ తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక తొలి టీ20లో గెలిచిన భారత్ ఈ టీ20లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తుండగా ఆసీస్ సైతం ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వరణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
మ్యాచ్ జరగనున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో శనివారం ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాయి. అయితే ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఇక ఇప్పటివరకు ఈ పిచ్పై మూడు టీ 20 మ్యాచ్లు జరుగగా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతగా నిలిచాయి.
తుది జట్ల అంచనా..
టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టొయినిస్, టీమ్ డేవిడ్, ఆరోన్ హార్దీ, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా