బంగ్లాదేశ్తో ఈరోజు జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరుకు బంగ్లా అడ్డు కట్ట వేశారు. భారత్ జట్టు కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుంటోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (104: 92 బంతుల్లో 7×4, 5×6), కేఎల్ రాహుల్ (77: 92 బంతుల్లో 6×4, 1×6) తొలి వికెట్కి 180 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చి ఔటవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి (26: 27 బంతుల్లో 3×4) ఆ దూకుడుని కొనసాగించేలా కనిపించాడు.
39వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బంతి వ్యవధిలో విరాట్ కోహ్లితో పాటు హార్దిక్ పాండ్య (0: 2 బంతుల్లో)లను ఔట్ చేసేశాడు.చివర్లో ధోనీ(35), దినేష్ కార్తీక్ (8) ఔటవ్వగా భారత్ స్కోరు 300 దాటింది. అయితే ఈక్రమంలోనే చివరి 5 ఓవర్లలో కేవలం 35 పరుగుల మాత్రమే నమోదు కాగా, భారత్ ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది.బంగ్లా స్పీడ్స్టర్ ముస్తాఫిజుర్(5/59) గొప్పగా బౌలింగ్ చేశాడు. కీలక సమయంలో ప్రధాన బ్యాట్స్మెన్ను పెవిలియన్ పంపి భారత్ జోరుకు బ్రేక్ వేశాడు