భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్కు వరణుడు విలన్గా మారారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు కూడా వర్షం పడితె భారత్కు విజయం ప్రతికూలంగా మారనుంది. డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం మ్యాచ్ కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షం అంతరాయంపై తీవ్ర అసహనానికి గురైన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేల్చుతున్నారు. మరి కొందరైతె వర్షం రాకూడదని ట్వీట్లు చేస్తున్నారు.
సెమీఫైనల్స్ కావడంతో ఎమోషన్స్ పీక్ స్టేజ్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు రావడం అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. దాదాపు వారం నుంచీ లేని వానలు సడెన్గా సెమీ ఫైనల్స్ నాడే రావాలా అని ఆవేదన చెందుతున్నారు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మంగళవారం కివీస్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు పడిన వర్షం… టీమిండియా ఫ్యాన్స్కి పరేషాన్ కలిగించింది. 46.1 పరుగుల దగ్గర న్యూజిలాండ్ 211/5గా నిలిచింది. ఇవాళ ఏదేమైనా వర్షం పడకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షం పడితే డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం జస్ట్ 20 ఓవర్లలో… టీమిండియా 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. పిచ్ తడిగా ఉన్ననేపథ్యంలో టార్గెట్ను చేధించడం భారత్కు కష్టంగా మారుతుంది. అందుకే వర్షం పడకూదని ప్యాన్స్ కోరుకుంటున్నారు.