- Advertisement -
మాంచెస్టర్లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. మ్యాచ్కు వరణుడి ముప్పు ఉందని అక్కడి అధికారలు తెలిపిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67 నాటౌట్), లాథమ్(3నాటౌట్)లు ఉన్నారు.