- Advertisement -
ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో చతేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ జట్టు లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా ఆడింది.ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. లంచ్ విరామం తరువాత విరాట్ అవుట్ అయినప్పటికి ,పట్టుదలతో ఆడాడు చతేశ్వర్ పుజారా.
280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో ఈ సిరీస్లో రెండో శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తిచేసిన పుజారాకు ఆసీస్పై ఇది నాలుగో శతకం.