Wednesday, May 22, 2024
- Advertisement -

ఆస్ట్రేలియా చేరుకున్న కీల‌క ఆట‌గాళ్లు…

- Advertisement -

ఈనెల 12 నుంచి ఆసిస్‌తో వ‌న్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే టెస్ట్ సీరీస్ గెలిచి రెట్టించిన విశ్వాసంతో వ‌న్డే బ‌రిలోకి దిగుతోంది. క‌నీసం వ‌న్డేలో నైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని ఆసిస్ తాప‌త్ర‌య ప‌డుతోంది. వ‌న్డే కోసం అగ్ర‌శ్రేణి టీమిండియా ఆట‌గాళ్లు ఆసిస్ చేరుకున్నారు.

మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ ఈరోజు సిడ్నీకి చేరుకున్నారు. వన్డే సిరీస్‌కి ఎంపికైన ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్ తదితరులు భారత్ నుంచి బయల్దేరి ఈరోజు అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఇటీవల తన భార్య రితికకి పాప పుట్టడంతో చివరి టెస్టు నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేసిన రోహిత్ శర్మ కూడా వెళ్లాడు.

ఆసిస్‌తో వ‌న్డే సిరీస్ కోసం జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు చేసింది. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కి అవకాశం కల్పించింది.

భారత్ వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -