జోహన్నెస్ బర్గ్లో జరగనున్న మోడో టెస్ట్ కోసం టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కనీసం ఈటెస్ట్ మ్యాచ్నైనా గెలిచి పరువునిలబెట్టుకోవాలని చూస్తోంది కోహ్లీ టీం. ప్రాక్టీస్ కోసం కేటాయించిన పిచ్లపై మరోసారి టీమిండియా ఫైర్ అయ్యింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ను చేజార్చుకున్న టీమిండియా…జొహనెస్బర్గ్ వేదికగా మూడో టెస్టు కోసం సిద్ధమవుతోంది.
జొహనెస్బర్గ్లో ప్రాక్టీస్ కోసం కేటాయించిన పిచ్ నాణ్యతపై టీమిండియా బ్యాటింగ్ కోచ్, ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరీస్లో ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లోనూ.. ఫాస్ట్, బౌన్సీ పిచ్లపై బౌలర్లు ఫర్వాలేదనిపించినా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు .తొలి టెస్టులో హార్దిక్ పాండ్య, రెండో టెస్టులో విరాట్ కోహ్లి చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కానీ.. జట్టుని ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు.
మూడో టెస్టుకి కూడా బౌన్సీ వికెట్ రూపొందిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ప్రాక్టీస్ కోసం అలాంటి పిచ్లే కావాలనే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్ స్పష్టం చేశాడట. దీంతో.. రవిశాస్త్రి జొహనెస్బర్గ్ క్యూరేటర్తో మాట్లాడి.. నాసిరకంగా ఉన్న ప్రాక్టీస్ పిచ్లపై రీ-రోలింగ్ చేయించి అనంతరం టీమిండియాతో ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది