Saturday, May 4, 2024
- Advertisement -

సఫారీలతో ఇక వన్డే సమరం… బదులు తీర్చేస్తారా?

- Advertisement -

స‌ఫారీల‌తో వ‌న్డేస‌మ‌రాని సిద్ద‌మ‌య్యింది భార‌త్‌. ఇప్ప‌టికె టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భార‌త్ కు ఇదే మంచి త‌రుణం. వ‌న్డేసిరీస్‌ను గెలిచి బ‌దులు తీర్చుకుంటుందా …? టెస్ట్ కోల్పోవ‌డంతో కోహ్లీసేన మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు మూడో టెస్ట్‌లో అద్భుత విజ‌యం సాధించి స‌మాధానం చెప్పింది భార‌త్‌.

టెస్టు సిరీస్ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆరు వన్డేల సిరీస్‌ డర్బన్ వేదికగా జరగనుంది. కింగ్స్‌ మీడ్‌ స్టేడియంలో భారత జట్టు ప్రోటీస్ ను ఓడించాలని గట్టిపట్టుదలగా బరిలో దిగుతోంది. తొలి మూడు వన్డేలకు డివిలియర్స్ అందుబాటులో లేకపోవడం భారత్ కు కలిసి వచ్చే అవకాశమే.

ఇక టీమిండియా వన్డే జట్టు పూర్తి సన్నద్ధతతో బరిలో దిగుతోంది. టెస్టుల్లో విఫలమైన రోహిత్ శర్మ వన్డేల్లో రాణించి ఆకట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ధావన్ కూడా తానేంటో విదేశాల్లో రుజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పేసర్లను ధాటిగా ఎదుర్కోవడం వీరి బలం కావడంతో టీమిండియాకు మంచి శుభారంభం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదీకాక టెస్టుల్లోలా డిఫెన్స్ ఆడాల్సిన అవసరం కూడా తక్కువగా ఉండడంతో సహజ శైలిలో స్వేచ్ఛగా మరింత ధాటిగా ఆడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ఇక రహానేను మూడో ఓపెనర్ గా పేర్కొంటున్నప్పటికీ మూడో నంబర్ లో కోహ్లీ ఫాంలో ఉన్నాడు. ఆ తరువాత కఠినమైన సఫారీ పిచ్ కు ఎదురొడ్డేందుకు రహానేను రంగంలోకి దించే అవకాశం కనబడుతోంది. ఆ తరువాతి స్థానానికి మనిశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, హార్డిక్ పాండ్య, మహేంద్రసింగ్ దోనీ పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో కోహ్లీ ఎలాంటి జట్టుతో బరిలో దిగుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమీ, ఉమేష్ యాదవ్ లు మంచి దూకుడుమీదున్నారు. వారికి జతగా చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ లలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. వనరులు సంవృద్ధిగా ఉన్న నేపథ్యంలో పటిష్ఠమైన జట్టుతో కోహ్లీ మైదానంలో దిగుతాడని వారు పేర్కొంటున్నారు.

టెస్టు సిరీస్ ఓటమి వన్డే సిరీస్ గెలుపుతో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని సగుటు అభిమానులు ఆశపడుతున్నారు. ఇక సఫారీలు కూడా బలంగా ఉన్నారు. బౌలింగ్ లో రబడా, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్ లు వణుకుపుట్టిస్తున్నారు. బ్యాటింగ్ లో అనుభవజ్ఞుడైన హసీమ్ ఆమ్లాకు జతగా, డుప్లెసిస్, డికాక్, డుమిని, మిల్లర్ ఆడనున్నారు. దీనికి తోడు సొంతగడ్డపై ఆడనుండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభం కానుండగా, సోనీ, టెన్ 1,3లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -