- Advertisement -
జోహన్స్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న చివరి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. 134 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ రబాడాబౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన పాండ్యా మూడు పరుగులు చేసి రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
అంతకు ముందు మురళీ విజయ్ 25, పార్థివ్ పటేల్ 16, లోకేశ్ రాహుల్ 16, చటేశ్వర్ పుజారా 1 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో రహానే (34) పరుగులు, భువనేశ్వర్కుమార్ (6) క్రీజ్లో ఉన్నారు.