Friday, May 10, 2024
- Advertisement -

భారీ స్కోర్ దిశ‌గా భార‌త్‌.. హ‌ఫ్ సెంచ‌రీలు చేసిన ధావ‌న్‌, కోహ్లీ …

- Advertisement -

జోహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో వ‌న్డేలో భార‌త్ భారీస్కోరు దిశ‌గా వెల్తోంది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ మ‌రో సారి నిరాశ ప‌రిచినా ధావ‌న్‌, కోహ్లీ స్కోరు బోర్డును పెంచేందుకు ధాటిగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఆదిలోనే భార‌త్‌కు ఎదురుదెబ్బ‌త‌గిలింది. 13 బంతుల్లో 5 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. రబాడ బౌలింగ్‌లో పెవిలియన్ చేరి మరోసారి నిరాశపర్చాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 65 (59), కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 (58) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 128 (22 ఓవర్లకి) గా ఉంది. ఇప్పటికే వరుసగా మూడు వన్డేలు ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలోనూ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -